ఫీలయ్యారా?

20, మార్చి 2009, శుక్రవారం

పార్టీ ఏదయినా, నాయకుడెవరైనా తప్పని "తారక" మంత్రం

ఒకటీ అరా పార్టీలు తప్ప అన్ని ప్రముఖ పార్టీలు, అధికారులు, సామాన్య ప్రజానీకం ఒక వ్యక్తిని మాత్రం ఈ ఎన్నికల సందర్భంగా బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఆయనే దివంగత ముఖ్యమంత్రి, తెలుగునాట సంచలనం నందమూరి తారక రామారావు. పలు రంగాల్లో ఆయన వేసిన ముద్ర అలాంటిది మరి.

రెండు రూపాయలకి కిలో బియ్యం ఇప్పుడు కాంగ్రెస్ వారి పాచిక అయ్యింది. ఇక ప్రజారాజ్యం ఆయన్ని తరచు గుర్తు చేసుకుంటోంది. రామారావు తీసుకు వచ్చిన రాజకీయ ఒరవడిని తామూ ఇప్పుడు సృష్టించగలమని, ఆయన మాదిరిగా అన్ని వర్గాలకి ఆధిపత్యాన్నీకట్టబెట్టి, డిల్లీ పెత్తనాన్ని సవాలు చేయగలమని వారంటున్నారు. ఇక దేశం వారు వేషధారణతో సహా ఆయన్ని అనుకరిస్తున్నారు. ఇక రెబల్స్ సంగతి చెప్పక్కర్లేదు.

ప్రజలతో మమేకమయి, తమ ప్రాంతం వారికి ఒక అస్థిత్వాన్ని చేకూరిస్తే ఏ నాయకుణ్ణయినా అలాగే గుర్తుపెట్టుకుంటారు.

కామెంట్‌లు లేవు: