ఫీలయ్యారా?

20, మే 2009, బుధవారం

పైనా, కిందా, అటుపక్క, ఇటుపక్క... ఈ రచ్చంతా కాంగ్రెస్ పుణ్యమే

ఈ దేశం వాళ్ళ బాబు గాడి సొమ్ము అన్నట్టు ప్రత్యేక దేశాలు ఉదారంగా కట్టబెడతారు. ముష్టి అందుకున్న వాళ్ల తోటే మనకి తలనొప్పి తెచ్చి పెడతారు. తాతల నుంచి మనవళ్ళ దాక ఈ వంశ పారంపర్య పాలనలో మన దేశానికి అన్ని పక్కల నుంచి ముప్పు వుండేలా వ్యవస్థని తీర్చి దిద్దారు కాంగ్రెస్ నాయకులు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, సియాచిన్ వగైరా మూకలన్నీ వీళ్ళ పుణ్యమే. శాంతి అనేది వీళ్ళ డిక్షనరీ లోనే లేదు. అశాంతి కి ఆజ్యం పోస్తారు. ఏదో ఒక రోజు దానికే బలవుతారు. దాన్ని అణిచే ప్రయత్నంలో మళ్ళీ అల్లర్లని చవి చూస్తారు.

అధిక సంఖ్యలో వున్నతమిళుల పక్షాన పోరాడుతున్న LTTE పైకి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపి శ్రీలంక ప్రభుత్వానికి మద్ధతు నిచ్చారు రాజీవ్ గాంధీ. ఒక పక్క చర్చలు జరుపుతూనే, రా పాత్ర వుండగానే, ఈ దారి ఎందుకు ఎంచుకున్నారనేది ఎవరికీ అర్ధం కాలేదు. పీస్ కీపింగ్ ఫోర్స్ ఆగడాలకు బలయిన వారి వివరాలను ప్రచురించింది LTTE. ఆ ఫోర్స్ లో తోటి తమిళుల పై పోరుకు సిద్ధమైన తమిళ సైనికుల బాధ వర్ణనాతీతం. ఇంత జరిగినా బల ప్రయోగం చేయకుండానే శాంతి భద్రతలను నెలకొల్పిందన్నరాజీవ్ గాంధీ మాటలను వారు ఏ విధంగా అర్ధం చేసుకుని వుంటారో ఊహించవచ్చు.

తాతలు తెచ్చి పెట్టిన తలనొప్పులకు మందు రాసుకోలేని ఆ ప్రభుత్వం చివరికి ఆ యువ నాయకుడినే అసంతృప్తికి బలి ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికలయ్యేంతవరకు ప్రభాకరన్ మా మిత్రుడు... లాంటి మాటల్ని కరుణానిధి చే పలికించి, ఫలితాల సమయంలో పులి ని మట్టు బెట్టింది. LTTE ఒక జాతి అసంతృప్తి నుంచి పుట్టింది. దానికి పరిష్కారం రాజకీయంగానే వెతకాల్సింది. బలవంతపు దాడుల వల్ల నష్ట పోయేది మన దేశమే. మన నాయకుల చరిత్రాత్మక, వ్యూహత్మక తప్పిదాలకు నాయకుల తో పాటు, సామాన్య ప్రజలు కూడా బలవుతూనే వున్నారు.

కామెంట్‌లు లేవు: