ఫీలయ్యారా?

21, జనవరి 2009, బుధవారం

ఇంట్లో దొంగలు పడితే పోలిసుకి ఫోన్ చేస్తారా, ముఠా నాయకుణ్ణి సంప్రదిస్తారా?

మనింట్లో దొంగలు పడ్డారు. సరదాగా ఒక గదిని ఆక్రమించేశారు. అప్పుడు మనం తెలివిగా దొంగల ముఠా నాయకుణ్ణి సంప్రదించాం! మీ దొంగలని వెనక్కి పిలవండి అని మొరపెట్టుకున్నాం. ఎందుకంటే ఆ దొంగల సామ్రాజ్యం (పాకిస్తాన్) మనం ప్రసాదించిందే. ముఠా నాయకుడు లాయక్ అలీ ఖాన్. వాడు తన ప్రమేయం లేకుండానే వాళ్లు మనింట్లో జొరబడ్డారు, దానికి నేనేమి చేయలేనని తన దొంగ బుద్ధి చూపించాడు. ఇది మన మదటి స్వాతంత్ర దినోత్సవానికి, రిపబ్లిక్ దినోత్సవానికి మధ్య (అక్టోబర్ 1947) జరిగింది.


అప్పటినుంచీ మనింట్లో వాళ్ల అరాచకాలు యదేచ్చగా జరిగిపోతున్నాయి. అది చాలదన్నట్టు ఇంట్లో వాళ్ళని, అతిథుల్ని పొట్టనబెట్టుకుంటున్నారు ( నవంబర్ 2008) . మనం మాత్రం మారలేదు. అలవాటుగా, ఇప్పుడు కూడా ముఠా (కొత్త) నాయకుణ్ణే సంప్రదిస్తున్నాం. మీ దుండగుల్ని మీరే శిక్షించాలి అని వేడుకుంటున్నాం. వాళ్లు కూడా అలవాటుగా మీ ఇంట్లో జొరబడ్డ వాళ్ళకి మాకు సంబంధం లేదు అని మరోసారి బుద్ధి చూపించారు. రోజుకోరకంగా మాట్లాడుతూ సమస్యని నానబెడుతున్నారు. మనకి మళ్ళీ రిపబ్లిక్ వేడుకలు వచ్చేశాయి. మన సార్వభౌమాధికారాన్ని పోగుడుకుంటూ ఆత్మ వంచనతో సంబరాలకి సిద్ధమవుతున్నాం.


గాయపడ్డ అతిథి దేశాల మద్దతుతో వాడింట్లో ప్రవేశించి నక్కివున్న దుండగుల పనిపట్టవచ్చు. వాడు మొండికేస్తే దౌత్య పరమైన, వాణిజ్య పరమైన ఆంక్షలను విధించవచ్చు. అసలు దొంగలు వాళ్ళా, వివిధ పత్రికలచే నపుంసకులని కీర్తినందుకున్న మనమా అర్థం కావడంలేదు.

గమనిక:

సదరు దొంగలకి మన మద్ధతు ఎల్లప్పుడూ వుంటుంది - ఈ విధంగా:

ముంబై పోలీసు అత్యుత్సాహం: ముంబై దాడుల్లో అసువులు బాసిన తీవ్రవాద సోదరుల దుప్పట్లు, దుస్తులు, ఇతర సామాగ్రి వేలం వేస్తారట! రెండు, మూడేళ్ళ క్రితం హమాస్, వారి తీవ్ర వాద కార్యకలాపాల కోసం వేలం ద్వారా డబ్బు సమీకరించినట్టు.


మదర్సాలకి పోషణ: మధ్యాహ్న భోజనం, పుస్తకాలు వగైరాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రోత్సహిస్తారట. హైదరాబాద్ లో మదర్సాల్లోనే సంఘవిద్రోహుల్ని తయారుచేసే శిక్షణ లభిస్తుందని చిన్న పిల్లలకి
కూడా తెలుసు.


షారుక్ ఖాన్, మరి ఇద్దరి ప్రముఖుల సలహాలు: ఆ తారలకి పాకిస్తాన్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ పోగొట్టుకోడమెందుకు అనుకున్నారేమో తొందరపడి దొంగల ముఠాని ఏమీ అనొద్దు అని ఉచిత సలహా పారేసారు.


అపకారికి ఉపకారం: గాంధీ గారి బాటలోనే దొరికి పోయిన వాణ్ని ఏమీ అనొద్దు అని హేమంత్ ఖర్కారే గారి సతీమణి సెలవిచ్చారు.

కొసమెరుపు:

ఈగోలంతా మనకేందుకనుకున్నారేమో మన డైనమిక్ త్రివిధదళాధిపతి ప్రతిభా పాటిల్ గారు శీతాకాల విడుదులు, దైవ దర్శనాలు, ఇతరత్రా "ముఖ్య" పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారు.

1 కామెంట్‌:

Jayasree Naidu చెప్పారు...

"Those who forget history are prone to repeat it." We prove that every inch- starting from centuries back stories of English, and their atrocities and now these issues... Why we hold back from adopting a strong, effective and long term solution for our problem?
It really burns the blood and, hurts the heart.